మంచిర్యాల్ జిల్లాలో విద్యుత్ టవర్ పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.తాండూరు మండలం అచలపూర్ గంపల పల్లి శివారులో ఈ రోజున విద్యుత్ టవర్ పై నుంచి పడిన రాహుల్ ఇస్లాం( 21) అనే యువకుడు మృతి చెందారు.
బెల్లంపల్లి నుండి కాగజ్నగర్ వరకు 132 కె.వి విద్యుత్ లైన్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇస్లాం అనే యువకుడు అచులపూర్ శివారులోని విద్యుత్ టవర్ పైకి ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు అక్కడి నుంచి కింద పడగా తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో ఇతనితో పని చేస్తున్న తోటి కూలీలు తీవ్రంగా గాయపడిన ఇస్లాం ను అంబులెన్స్లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మెడకు బలమైన గాయం కావడంతో, ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారించారట.
ఇకపోతే మృతి చెందిన రాహుల్ పశ్చిమబెంగాల్ ప్రాంతానికి చెందిన వాడని తెలుస్తుంది.
కాగా ఇతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారట.