ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.
అయితే ఈ ముగ్గురు వెనుక రాజమౌళి ఉన్నాడు కాబట్టి వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు.
ఇక రాజమౌళి మరో టాలీవుడ్ హీరోను కూడా పాన్ ఇండియా స్టార్ గా మార్చబోతున్నాడు.
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు.అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఇలా స్టార్ హీరోలు దాదాపు పాన్ ఇండియా స్టార్ లుగా మారిపోతున్నారు.దీంతో ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియా పై కన్నేశారు.
వారు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలనీ ముందుకు వస్తున్నారు.
ఈ లిస్టులో ముందు ఉన్న హీరోలు ఎవరంటే నాని, నిఖిల్.
.వీరిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లో ముందు ఉన్నారు.నాని దసరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో నాని పాన్ ఇండియా స్టార్ గా మారాలని ట్రై చేస్తున్నాడు.మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
అలాగే నిఖిల్ కూడా పాన్ ఇండియా రేస్ లో ఉన్నాడు.ఈయన ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.కార్తికేయ 2, స్పై సినిమాలను ప్రకటించిన నిఖిల్ ఈ రెండు సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ ఇద్దరు హీరోలు కూడా సబ్జెక్టు పరంగా యూనిక్ కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారాలని తహతహ లాడుతున్నారు.చూడాలి మరి చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటుతారో లేదో.