టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రీతూవర్మ ప్రస్తుతం వరుడు కావలెను సినిమాలో నటిస్తుండగా మరో 48 గంటల్లో ఈ సినిమా ఫలితం తేలనుంది.సినిమాలో పెళ్లంటే నచ్చని యువతి పాత్రలో నటించిన రీతూవర్మ తన పెళ్లి గురించి స్పందిస్తూ మరో రెండు మూడు సంవత్సరాలు తనకు పెళ్లి గురించి ఆలోచన లేదని పేర్కొన్నారు.
నేటితరం అమ్మాయిలను పోలిన పాత్రలలో తాను నటిస్తున్నానని రీతూవర్మ వెల్లడించారు.
ఈ ఏడాది రిలీజవుతున్న మూడో సినిమా వరుడు కావలెను అని ఈ ఏడాది తను నటించిన నిన్నినా నిన్నిలా, టక్ జగదీష్ ఓటీటీలలో విడుదల కాగా వరుడు కావలెను మూవీ మాత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని రీతూవర్మ పేర్కొన్నారు.
సవాళ్లను స్వీకరించడం తనకు ఇష్టమని ఒత్తిడి ఉంటే మాత్రమే తన నుంచి మంచి పనితీరు వస్తుందని రీతూవర్మ వెల్లడించారు.ఈ సినిమాలోని పాత్రల ద్వారా తాను పరిపూర్ణమైన నటిగా గుర్తుంటానని రీతూవర్మ పేర్కొన్నారు.
ఈ సినిమా ప్రేమకథ అని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని రీతూవర్మ తెలిపారు.తమ జోడీ బాగుందని షూటింగ్ సమయంలోనే కామెంట్లు వినిపించాయని రీతూవర్మ వెల్లడించారు.నిజ జీవితంలో తన జీవితంలోకి వరుడు రావడానికి సమయం ఉందని పేరెంట్స్ కూడా తనను పెళ్లి త్వరగా చేసుకోవాలంటూ బలవంతం చేయడం లేదని రీతూవర్మ అన్నారు.
చారిత్రాత్మక కథలతో తెరకెక్కే సినిమాలలో నటించాలని తన కోరిక అని అలాంటి కథలు వస్తే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని రీతూవర్మ వెల్లడించారు.తమిళంలో ఒక సినిమాతో పాటు శర్వానంద్ హీరోగా రెండు భాషల్లో తెరకెక్కే ఒక సినిమాలో తాను నటిస్తున్నానని రీతూవర్మ చెప్పుకొచ్చారు.సక్సెస్ రేట్ ఎక్కువగా లేని రీతూవర్మకు ఈ సినిమాతో సక్సెస్ ఖాతాలో చేరుతుందేమో చూడాల్సి ఉంది.