సినిమా రంగంలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసిన కథలో మరో హీరోయిన్ నటించడం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది.అలా అనుపమ పరమేశ్వరన్ చాలా కథలను రిజెక్ట్ చేయగా ఆ సినిమాల్లో వేరే హీరోయిన్లు నటించారు.
అనుపమ మిస్ చేసుకున్న సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.అనుపమ మిస్ చేసుకున్న సినిమాల జాబితా ఎక్కువగానే ఉండటం గమనార్హం.
తొలుత మలయాళ సినిమాల్లో నటించిన అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం పుష్కలంగా ఉండటంతో వేగంగానే అవకాశాలను సంపాదించుకున్నారు.తెలుగులో ఆమె నటించిన అఆ, ప్రేమమ్ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నటిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
శతమానం భవతి సినిమా నటిగా అనుపమ పరమేశ్వరన్ స్థాయిని మరింత పెంచింది.
నాని హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన నేను లోకల్ సినిమాలో నటించే ఛాన్స్ మొదట అనుపమకే దక్కింది.
కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమాలో నటించే ఛాన్స్ ను అనుపమ మిస్ చేసుకున్నారు.రంగస్థలం సినిమాలో మొదట అనుపమ హీరోయిన్ గా ఎంపిక కాగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి అనుపమ తప్పుకోవాల్సి వచ్చింది.
అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ ను కూడా అనుపమ మిస్ చేస్ చేసుకున్నారని సమాచారం.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం సినిమాతో పాటు నితిన్ హీరోగా తెరకెక్కిన ఛల్ మోహన్ రంగా సినిమాల్లో నటించే ఛాన్స్ అనుపమకే రాగా కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమాల్లో నటించలేకపోయారు.ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ తో పాటు వి సినిమాలో అదితీరావు హైదరీ పాత్రను కూడా అనుపమ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోని ఒక పాత్రను, నిశ్శబ్దం సినిమాలోని షాలినీ పాండే పాత్రను అనుపమ రిజెక్ట్ చేసినట్టు సమాచారం.