టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ మధ్యకాలంలో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ యంగ్ హీరో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో సంచలనంగా మారింది.
అయితే తాజాగా నిఖిల్ సిద్ధార్ధ “శిఖరాన్ని చూసి కుక్కలు ఎంత మొరిగిన ప్రయోజనం ఉండదు” అంటూ టాలీవుడ్ పవర్ స్టార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఈ ఫోటోని అనుసంధానం చేసి ఫీట్ చేశాడు.
దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ చేస్తున్నారు.అంతేగాక ఎప్పుడు కామ్ గా ఉండేటువంటి నిఖిల్ సిద్ధార్థ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.
దీంతో నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి కామెంట్లు చేశాడు అంటూ తెగ చర్చించుకుంటున్నారు.అయితే మరి కొంతమంది మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఓ దర్శకుడు సినిమా తీస్తున్నాడని ఆ దర్శకుడి ని ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు చేశాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇ నిజానిజాలు తెలియాలంటే ఈ విషయంపై నిఖిల్ సిద్ధార్ధ స్పందించాల్సిందే.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిఖిల్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న “కార్తికేయ 2” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రం గతంలో నిఖిల్ హీరోగా నటించిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఉండనుంది.అలాగే కుమారి 21ఎఫ్ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.