టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య కొత్త అపార్టుమెంట్ ను కొనుగోలు చేశారు.నాగచైతన్య సమంత విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్టుమెంట్ లో ఉన్నారు.
విడాకులకు సంబంధించి అధికారిక ప్రకటన చేయకముందే నాగచైతన్య, సమంత విడిగా ఉండటం గమనార్హం.గతేడాది సమంత, చైతన్య కలిసి జూబ్లీహిల్స్ లో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు.
అయితే ఆ బంగ్లాకు రెన్నోవేషన్, ఇంటీరియర్ పనులు జరుగుతుండగా ఆ పనులు పూర్తి కావాలంటే సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉండటంతో చైతన్య ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఫ్యామిలీతో కలిసి ఉండే అవకాశం ఉన్నా చైతన్య మాత్రం ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతున్నారని తెలుస్తోంది.
ఒక పోష్ ఏరియాలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి చైతన్య అపార్టుమెంట్ ను తీసుకున్నారని అతి త్వరలో అక్కడికి షిఫ్ట్ కాబోతున్నారని సమాచారం.
గత నెల 24వ తేదీన విడుదలైన లవ్ స్టోరీ సినిమాతో చైతన్య ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాతో పాటు బంగార్రాజు సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే హార్రర్ వెబ్ సిరీస్ కు సైతం చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నాగచైతన్య నటించిన రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
బంగార్రాజు సినిమాలో నాగచైతన్య తండ్రితో కలిసి నటించనున్నారు.గతంలో నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో మనం సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.చైతన్య కెరీర్ పరంగా స్టార్ స్టేటస్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.