ఈ మధ్య కాలంలో ఆది సాయికుమార్ నటించిన సినిమాలు ఆరు నెలల గ్యాప్ లో ఒకటి చొప్పున విడుదలవుతున్నాయి.అయితే ఈ సినిమాలలో ఎక్కువ సినిమాలు సరైన ఫలితాన్ని అందుకోవడం లేదు.
ఈ నెల 7వ తేదీన ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవోభవ సినిమా విడుదలైంది.నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఏరియాలలో సినిమాను ఓన్ గా రిలీజ్ చేసుకోగా ఈ సినిమాకు కోటీ 30 లక్షల రూపాయల బిజినెస్ జరిగింది.
అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు మాత్రం కేవలం పాతిక లక్షల రూపాయలు కావడం గమనార్హం.ఈ సినిమా రిలీజ్ కు ముందు పరవాలేదనే స్థాయిలో అంచనాలు ఏర్పడినా సినిమాకు కలెక్షన్లు మాత్రం రాలేదు.
ఆది సాయికుమార్ ఖాతాలో ఈ సినిమాతో మరో ఫ్లాప్ చేరింది.ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టాలు వచ్చాయి.
థియేటర్లలో ఈ సినిమా కేవలం వారం రోజులకే పరిమితమైంది.
మరోవైపు ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు కూడా అమ్ముడుపోలేదని సమాచారం.ఈ సినిమా నిర్మించిన నిర్మాతలకు నష్టాలే మిగిలాయని సమాచారం.కొత్త కథలను ఎంచుకుంటున్నా ఆదికి సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న ఆది సాయికుమార్ కు ఈ మధ్య కాలంలో తను హీరోగా నటించి విడుదలవుతున్న ప్రతి సినిమాతో షాకింగ్ ఫలితాలు ఎదురవుతున్నాయి.
కథల విషయంలో జాగ్రత్త పడితే ఆది సాయికుమార్ కోల్పోయిన మార్కెట్ ను తిరిగి పొందడం కష్టం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆది సాయికుమార్ భవిష్యత్తు సినిమాలైనా విజయాన్ని అందుకుంటాయో లేదో చూడాల్సి ఉంది.ఆది సాయికుమార్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.ఆది కేరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.