కొత్త సినిమాని ఎనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ

ఆ! సినిమాతో మంచి విషయం ఉన్న టాలెంటెడ్ దర్శకుడుగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రశాంత్ వర్మ.అయితే మొదటి సినిమా కమర్షియల్ గా అతనికి సక్సెస్ ఇవ్వకపోయినా రెండో సినిమాని రాజశేఖర్ తో కల్కీ మూవీని తెరకెక్కించారు.

 Young Director Prasanth Varma Announced New Movie Project, Tollywood, Zombie Red-TeluguStop.com

ఈ మూవీ కూడా బాగుందనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ సక్సెస్ కి దూరమైంది.దీనికి తోడు రాజశేఖర్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడంతో నష్టాలు తప్పలేదు.

ఇక తాజాగా తేజ సజ్జాని హీరోగా పరిచయం చేస్తూ జాంబీరెడ్డి అనే సినిమా తెరకెక్కించారు.ఈ మూవీని మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కించడంతో హిట్ టాక్ తెచ్చుకొని భాగానే లాభాలు తెచ్చి పెట్టింది.

దీనికి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.అయితే వెంటనే సీక్వెల్ స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు.

ఊహించని విధంగా ఇప్పుడు ఈ యువ డైరెక్టర్ అందరిని సర్ప్రైజ్ చేస్తూ మరో కొత్త ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు.దీనికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

ప్రీలుక్ పోస్టర్ లో పర్వతాలని పెట్టడం ద్వారా ఇదేదో డిఫరెంట్ జోనర్ లో ట్రై చేస్తున్న మూవీలానే అనిపిస్తుంది.పర్వతారోహకులు సాహస కథలని ఎప్పటికప్పుడు మనం చదువుకుంటాం.

అలాంటి ఒక స్పూర్తివంతమైన కథని ఈ సారి ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడేమో అనే డౌట్ అందరికి వస్తుంది.మరి ఈ సారి ఎలాంటి విభిన్నమైన కథనాన్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయడానికి ఈ యువ దర్శకుడు సిద్ధం అవుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube