ఆ! సినిమాతో మంచి విషయం ఉన్న టాలెంటెడ్ దర్శకుడుగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ప్రశాంత్ వర్మ.అయితే మొదటి సినిమా కమర్షియల్ గా అతనికి సక్సెస్ ఇవ్వకపోయినా రెండో సినిమాని రాజశేఖర్ తో కల్కీ మూవీని తెరకెక్కించారు.
ఈ మూవీ కూడా బాగుందనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ సక్సెస్ కి దూరమైంది.దీనికి తోడు రాజశేఖర్ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టడంతో నష్టాలు తప్పలేదు.
ఇక తాజాగా తేజ సజ్జాని హీరోగా పరిచయం చేస్తూ జాంబీరెడ్డి అనే సినిమా తెరకెక్కించారు.ఈ మూవీని మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కించడంతో హిట్ టాక్ తెచ్చుకొని భాగానే లాభాలు తెచ్చి పెట్టింది.
దీనికి సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు.అయితే వెంటనే సీక్వెల్ స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు.
ఊహించని విధంగా ఇప్పుడు ఈ యువ డైరెక్టర్ అందరిని సర్ప్రైజ్ చేస్తూ మరో కొత్త ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు.దీనికి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రీలుక్ పోస్టర్ లో పర్వతాలని పెట్టడం ద్వారా ఇదేదో డిఫరెంట్ జోనర్ లో ట్రై చేస్తున్న మూవీలానే అనిపిస్తుంది.పర్వతారోహకులు సాహస కథలని ఎప్పటికప్పుడు మనం చదువుకుంటాం.
అలాంటి ఒక స్పూర్తివంతమైన కథని ఈ సారి ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడేమో అనే డౌట్ అందరికి వస్తుంది.మరి ఈ సారి ఎలాంటి విభిన్నమైన కథనాన్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయడానికి ఈ యువ దర్శకుడు సిద్ధం అవుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది.