ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటికే అత్యవసర లాక్ డౌన్ విధించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు.
అంతేగాక ప్రజలకు అవసరమైన సర్వీసులు తప్ప మిగిలిన అన్ని సర్వీసులను మూసి వేశారు.దీంతో పెళ్లికాని ప్రసాదులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కల్యాణ మండపాలు, క్యాటరింగ్ సర్వీసులు వంటివి మూసివేయడంతో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నటువంటి వధూవరులు ఆన్ లైన్ ద్వారా పెళ్లి చేసుకుంటున్నారు.తాజాగా ఓ యువకుడు అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని ఏకంగా యువతిని పెళ్లి కూతురుగా చేసి అలాగే ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతుండగానే సెల్ ఫోన్ కి తాళి కట్టాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై పలువురు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
మరికొందరైతే సాంప్రదాయబద్ధంగా వరుడు వధువు మెడలో తాళి కడితేనే అది పెళ్లి అవుతుందని ఇలా సెల్ ఫోన్ కి కంప్యూటర్లకి తాళి కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.ఇంకొందరైతే మాత్రం ఇలాంటి లేనిపోని ఆచారాలను కొత్తగా సృష్టించవద్దని ఇలాంటి వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంతేకాక వేడుకలనేవి బంధువులు, సన్నిహితులు, అయిన వాళ్ళ మధ్యలో జరుపుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలోని దాదాపుగా ఈ సీజన్లో 15 వేల పెళ్లిళ్లు ఆగిపోయాయి.అంతేకాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మరి కొంతకాలం పాటు ఈ లాక్ డౌన్ పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి.
దీంతో పెళ్లికాని ప్రసాదులు ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ క్లియర్ అవుతుందా అని దీనంగా ఎదురుచూస్తున్నారు.