ఈ మధ్య కాలంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు వారి జీవితాన్ని చీకట్లోకి నెడుతున్నాయి ఇక కొంతమంది తీసుకున్న నిర్ణయాలు వారికి జీవితమే లేకుండా చేస్తున్నాయి.తండ్రి మందలించాడని.
టీచర్ తిట్టిందని ఆత్మహత్యకు పాల్పడుతూ తనువు చాలిస్తున్నారు.తాజాగా ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.
టీవీ చూడడం ఆపి ఉద్యోగాల కోసం దరఖాస్తు చదువుకోవాలంటూ తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది.
ప్రకాశం జిల్లా పాలమూరు లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
మాధవ రావు పద్మ దంపతులు కొత్త పల్లె గ్రామంలో నివసిస్తున్నారు .వీరికి దేవి ప్రసన్న అనే 20 ఏళ్ల కూతురు కూడా ఉంది.ప్రస్తుతం కూతురు బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతుండగా వీరి కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.అయితే లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుంచి విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే ఉంటుంది.
ఈ క్రమంలోని టీవీ కి బాగా అలవాటు పడింది ఆ యువత.ఇక టీవీ కి బానిసగా మారిన తన కూతురిని తండ్రి మందలించాడు.
ఎప్పుడు టీవీ చూడడమేనా.త్వరలో ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుంది బాగా చదువుకొని ఉద్యోగం సాధించూ అంటూ కాస్త మందలించాడు.
ఇక ఆ తర్వాత రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు.కానీ తెల్లారి లేచి చూసేసరికి కూతురు లక్ష్మి ప్రసన్న విగతజీవిగా మారిపోయింది.
గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది లక్ష్మీ ప్రసన్న.దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.