ఒడిశాలో ఘోరం చోటుచేసుకుంది.ఒక యువకుడు లారీ చక్రాల కింద పడి మృతి చెందినట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే రోడ్డుపై కి నిలుచున్న ఒక యువకుడు అటుగా వస్తున్న లారీ ని చూసి ఒక్కసారిగా లారీ వెనుక చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కారణం తెలియదు కానీ ఆ యువకుడు మాత్రం కావాలని లారీ చక్రాల కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం తెలుస్తుంది.
ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అన్నీ కూడా అక్కడి సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వడం తో ఈ విషయం అర్ధం అవుతుంది.అయితే ఈ ఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగానే చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని రాజు సాహు గా అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు,కారణం ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.