చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యువతరం వాటికి ఎంతగా ఎడిక్ట్ అయిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సోషల్ మీడియా వ్యామోహంలో పడి చదువులని కూడా నిర్లక్ష్యం చేస్తూ నిత్యంతో వాటితోనే గడుపుతున్నారు.
ఇక తల్లిదండ్రులు అవి వద్దని మందలిస్తే ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్తున్నారు.ఈ మధ్య కాలంలో టిక్ టాక్ వీడియో షేరింగ్ యాప్ తో పాటు పబ్ జీ గేమ్ యూత్ మీద విపరీతంగా ప్రభావం చూపిస్తుంది.
ఈ పబ్ జీ వ్యామోహంలో పడి ఈ మధ్యకాలంలో యువతరం ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగు చూసాయి.తాజాగా మరో సంఘటన ఇప్పుడు పబ్ జీ ప్రభావం ఎ స్థాయిలో ఉందో చెబుతుంది.
పబ్ జీ గేమ్ ఆడుతూ పిచ్చోడిలా మారిపోయాడు ఓ యువకుడు రోడ్డు మీద పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం.పబ్ జీ గేమ్ ఆడుతున్నట్టు ఒట్టి చేతులనే గన్గా మార్చి బుల్లెట్స్ పేలుస్తున్నట్టుగా ఢామ్ ఢామ్ అంటూ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశాడు.
ఈ పిచ్చి ప్రవర్తనను గమనించిన స్థానికులు అతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు.అదికాస్తా వైరల్ గా మారింది.అయితే అతని పరిస్థితి చూసిన చాలా మంది పబ్ జీ యువతరాన్ని మానసికంగా ఎంత క్రుంగదీస్తుందో గ్రహించి ఇప్పటికైనా దానిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.