ప్రేమ పెళ్లిళ్లు ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయాయి.ప్రేమ పేరుతో ఎందరో యువతీ,యువకులు పెళ్లి బంధం తో ఒకటవుతున్నారు.
అయితే శ్రీకాకుళం జిల్లా లో కూడా ఇలాంటి ప్రేమ వివాహమే ఒకటి జరిగింది.అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రేమించానని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్న ఆ యువకుడు మాత్రం తాళి కట్టిన తెల్లారే కనపడకుండా పోయాడు.
నిజంగా ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలంలో చోటుచేసుకుంది.గత నాలుగు నెలలు గా వెంకటేష్ అనే యువకుడి తో పోలాకి మండలానికి చెందిన ఒక మైనర్ యువతికి పరిచయం అయ్యాడు.
నాలుగు నెలలుగా ఆ యువతి కాలేజీ కి వెళ్లొచ్చే సమయంలో వెంటపడి, ప్రేమించానని,పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు.దీనితో ఆ యువతి కూడా అతడి ప్రేమకు ఫిదా అయి వెంకటేష్ కు బాగా దగ్గరై పోయింది.
ఈ క్రమంలో గురువారం రాత్రి తన తాత ఇంటిదగ్గర ఉన్న యువతిని పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ అమ్మాయి కూడా ఒకే చెప్పడం తో ఎవరికీ తెలియకుండా రాత్రి కొండమీదకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు.అయితే అంతా బాగా జరిగిందిలే అని అనుకుంటే తీరా ఆ యువతి తెల్లారి లేచి చూసేసరికి ఆ యువకుడు కనిపించకుండా పోయాడు.
తెల్లారేవరకు అక్కడే ఉన్న ఆ యువకుడు తెల్లరాగానే మాత్రం ఆ యువతిని అక్కడే వదిలేసి పారిపోయినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడం తో యువతిని మోసం చేసిన ఆ యువకుడు వెంకటేష్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది.