ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో తిరుపతికి వచ్చిన సినీ నటుడు సీనియర్ హీరో సుమన్ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
బయట పరిస్థితులు గోరంగా ఉన్న ఇలాంటి సమయంలో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయాలు తీసుకోవడం దారుణమని పేర్కొన్నారు.ఎన్నికలు జరిగితే ఉద్యోగస్తులకు అదే విధంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనలో వెనుక కుట్ర ఉందని.ఈ విషయంలో ప్రతిపక్షాలు జగన్ ని విమర్శించడం దారుణమని పేర్కొన్నారు.అంతే కాకుండా రాష్ట్రంలో అతి తక్కువ టైమ్ లో.భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయటం నిజంగా గ్రేట్ అని ఇతర రాష్ట్రాలు జగన్ పాలన ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఎంను ఎన్నుకున్నారు.సాధారణ మధ్య తరగతి ప్రజలు పరిపాలన విషయంలో సంతోషంగా ఉన్నారనేది నా అభిప్రాయం అంటూ సుమన్ చెప్పుకొచ్చారు.
.