ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూటే సపరేటు.ఈయన నిందితులకు శిక్ష వేయడంలో నైనా ప్రజలకు మంచి చేయడంలో నైనా మొండిగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శిస్తున్న అసలు పట్టించుకోరు.
మరి అలాంటి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ఆ నిర్ణయం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో దాని కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
2015లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజ్మహల్కు సమీప ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో మొఘల్ మ్యూజియం నిర్మించడానికి ఆమోద ముద్ర వేశారు.తాజాగా ఈ మ్యూజియం పేరును మార్చాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రి మొఘల్ మ్యూజియం పేరును వారిపై పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ పేరుగా మారుస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే ఈ నయా ఉత్తరప్రదేశ్ లో లొంగుబాటు మనస్తత్వాన్ని సూచించే చిహ్నాలను తన ప్రభుత్వం తొలగిస్తుందని స్పష్టం చేశారు.