మ్యూజియం పేరు మార్చిన యోగి!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూటే సపరేటు.ఈయన నిందితులకు శిక్ష వేయడంలో నైనా ప్రజలకు మంచి చేయడంలో నైనా మొండిగా తాను చేయాలనుకున్నది చేసుకుంటూ పోతారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శిస్తున్న అసలు పట్టించుకోరు.

 Yogi Sensational Decesion, Uttar Pradesh Cm, Yogi Adityanadh, Akhilesh Yadav, Ta-TeluguStop.com

మరి అలాంటి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ఆ నిర్ణయం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో దాని కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

2015లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తాజ్‌మహల్‌కు సమీప ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో మొఘల్ మ్యూజియం నిర్మించడానికి ఆమోద ముద్ర వేశారు.తాజాగా ఈ మ్యూజియం పేరును మార్చాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రి మొఘల్ మ్యూజియం పేరును వారిపై పోరాటం చేసిన ఛత్రపతి శివాజీ పేరుగా మారుస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ నయా ఉత్తరప్రదేశ్ లో లొంగుబాటు మనస్తత్వాన్ని సూచించే చిహ్నాలను తన ప్రభుత్వం తొలగిస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube