2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఎం.ఐ.
ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేశారు.అయితే చేసిన సవాల్ ను తాము స్వీకరిస్తున్నామని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.2022 లో జరిగే ఎన్నికల్లో తాము 300 పైగా సీట్లను గెలుచుకుంటామని మీరో.మేమో తేల్చుకుందామని ఆయన సవాల్ విసిరారు.
యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.ఈ క్రమంలో మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్ ఒవైసీ ఈ దేశ పెద్ద నాయకుడని ఆయన సవాలుని మా పార్టీ కార్యకర్తలు స్వీకరిస్తున్నారని అన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ అఖండ విజయానికి కారణం తమ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే అని అన్నారు.ప్రధాని మోడీ ఓరియెంటెడ్ పాలసీలే కారణమని యోగి అన్నారు.
ఈ ఎన్నికల ఫలితాలే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని అన్నారు.రానున్న ఎన్నికల్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని ఒవైసీ ట్వీట్ చేశారు.
ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లకు పోటీ చేస్తుందని ముస్లీం లు ఎక్కువగా ఉన్న చోట్ల తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడతామని ఆయన అన్నారు.ఇదిలాఉంటే యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు యోగొ ఆదిత్యనాథ్ ను ప్రధాని మోడీ అభినందించారు.