కోవలంలో అదృశ్యమైన లాత్వియా దేశ మహిళ లిగా స్క్రోమేన్ మృతదేహం లభ్యమైంది.ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.డీఎన్ఏ, శవపరీక్ష నివేదికలు రాగానే ఆ ఆరుగురిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
వివరాలలోకి వెళ్తే.
మానసిక రుగ్మతతో భాదపడుతూ ఎంతో కుంగిపోతున్న విదేశీయురాలైన స్క్రోమేన్ ఆమె భర్త ఆండ్రూస్, సోదరి ఇల్జాతో కలిసి భారత్కు వచ్చారు.చికిత్స నిమిత్తం కోవలంలోని ఆయుర్వేద వైద్యాలయంలో చేరారు.ఈ క్రమంలోనే- మార్చి 14న ఆమె కనిపించకుండా పోయింది ఆ తరువాత తిరువల్లూరులోని మడ అడవుల ప్రాంతంలో ఇటీవల మృతదేహం ఒకటి లభ్యమైంది.
విచారణ చేసిన పోలీసులు ఈ మృతదేహం ఆమెదేనని గుర్తించారు.
అయితే వైద్యంలో భాగంగా ఆమెకి యోగా నేర్పే గురువే ఆమెను హత్యాచారం చేశాడని అనుమానాలు రేకెత్తుతున్నాయి అంటున్నారు అతడు సిగరెట్లలో మత్తుమందు కూరి ఆమెకు ఇవ్వడం చూశామని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
లిగా పట్ల నమ్మకం కనబరుచుకున్న యోగా ఉపాధ్యాయుడు… ఆమెను మరికొందరితో కలిసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడనీ, అప్పట్నుంచీ ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులు నిర్ధారణకి వచ్చారు.
ఆమెని సుమారు ఆరుగురు అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళారని వారి వద్ద మత్తుమందులు కూడా ఉన్నాయని ఓ వ్యక్తీ ద్రువీకరిచాడు.
ఆ ఆధారాలతోనే నిందితులని అదుపులోకి తీసుకున్నారు.లిగా కాళ్లపై లోతైన గాయాలున్నాయనీ, గొంతు నులిమి ఆమెను చంపేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని వారు తెలిపారు.
ఈ ఘటనా స్థలంలో లభించిన తల వెంట్రుకలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు.త్వరలోనే నిందితులపై ఖటినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.