టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీకి భయం పట్టుకుందని మాజీ మంత్రి గంటా అన్నారు.అయితే మొన్నటి మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమేనన్న ఆయన అసలు సినిమా ముందుందని తెలిపారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విధ్వంస, అరాచక పాలన సాగుతోందని గంటా ఆరోపించారు.మద్యపాన నిషేధం అని ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
విశాఖ రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టులను గాలికొదిలేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.