తన నటన, అభినయం, అందంతో భారతదేశంలోని వివిధ చిత్రసీమలలో తనకంటూ అభిమానులను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈవిడ అవకాశాలు కొద్దీ మేర తగ్గిన కూడా సరే స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది.
ఈవిడ టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా లక్ష్మీ కళ్యాణం సినిమా లో కళ్యాణ్ రామ్ జంటగా నటించింది.ఆ తరువాత చాలా రోజులకు కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చందమామ సినిమాలో తన నటనతో పాటు అందచందాలను కూడా ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది.
ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మగధీర సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది.
అక్కడి నుంచి ఆవిడ వెనక్కి తిరగలేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల అందరి సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ లో కూడా పలకరించింది.ఇకపోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ భారతీయుడు 2, ప్యారిస్ ప్యారిస్, టాలీవుడ్ లో ఆచార్య సినిమాలో, అలాగే మంచు విష్ణు సరసన మోసగాళ్లు, ముంబై సాగా వంటి పలు సినిమాలలో నటిస్తోంది.
ఇక తాజాగా సోషల్ మీడియాలో తన పెళ్లి ప్రస్తావన తెగ హల్ చల్ చేస్తోంది.అయితే ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.అందులో అవును అది నిజమే నేను గౌతం కిచ్లు ఈనెల 30వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు తెలియజేసింది.ఇరువురి కుటుంబాలు ఈ వివాహానికి ఒప్పుకున్నారు అని అలాగే మా ఇద్దరి భావాలు కూడా ఎంతో బాగా కలిశాయని కాజల్ తన పోస్టులో వివరించింది.
అయితే ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ నేపథ్యంలో ముంబై నగరంలో కేవలం తన ఇంటి కుటుంబ సభ్యుల నడుమ మాత్రమే తన పెళ్లి జరుగుతుందని, కాబట్టి అభిమానులందరి ఆశీస్సులు తనకు కావాలని కాజల్ అగర్వాల్ అందులో కోరారు.