ఎల్లో మీడియా అనగానే వెంటనే గుర్తుకు వచ్చే మాట.చంద్రబాబుకు, టీడీపీకి అనుకూలం.
వైసీపీకి, ఆ పార్టీ అధినేత సీఎం జగన్కు వ్యతిరేకమనే! నిజమే.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్పై తీవ్రస్థాయిలో కథనాలు రాయడంతోపాటు.
ఆయనను మానసికంగా కూడా ఇబ్బంది పెట్టేందుకు ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నించింది.ఆఖరుకు గత ఏడాది ఎన్నికల సమయంలోనూ జగన్ను అధికార పీఠానికి చేరువ కాకుండా చూసేందుకు కూడా ప్రయత్నించింది.
ఈ క్రమంలో ఎన్ని రాయాలో.ఎన్ని చేయాలో.
అన్నీ చేసేసింది. ఎల్లో మీడియా!
అయినా కూడా ప్రజలు మాత్రం జగన్ వైపే మొగ్గు చూపారు.
ఇక, ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కూడా ఎల్లో మీడియా తన దూకుడు అలానే కొనసాగిస్తోందా? జగన్పై ఇంకా బురద జల్లుతూనే ఉండా.కిందపడ్డా.
చంద్రబాబుదే.పైచేయి అన్నట్టుగా ఇంకా కథనాలు రాస్తోందా? అంటే.తాజా పరిణామాలను గమనిస్తే.ఎల్లో మీడియాలో విభజన కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.ప్రస్తుతం రెండు విషయాలు ఏపీలో సంచలనం రేపాయి.
ఒకటి దుర్గగుడిలో వెండి సింహాల ప్రతిమలు.
మూడు అదృశ్యం కావడం.రెండు.
మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్పై ఏసీబీ కేసు నమోదు.హైకోర్టు ఉత్తర్వులు.
ఈ రెండు అంశాలను ఎల్లో మీడియా తీసుకున్న విధానంలో సంపూర్తిగా విభజన కనిపించింది.ఓ వర్గం ఎల్లో మీడియా.
ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేసింది.అసలు ఏం జరిగింది? ఎవరి వాదన ఏంటి? అనేది దానిని మాత్రమే పేర్కొంది తప్ప.ఈ విషయాల్లోకి జగన్ను నేరుగా లాగేయలేదు.ఆయనపై బురద జల్లలేదు.
కానీ.మరో వర్గం ఎల్లో మీడియా మాత్రం ఈ రెండు విషయాలను జగన్కు ముడిపెట్టి.విమర్శల వర్షం కురిపించడంతోపాటు.పుంఖాను పుంఖానులుగా గతానికి ముడిపెట్టి.జగన్ కక్ష సాధిస్తున్నారనే కోణంలో వండివార్చింది.ఈ పరిస్థితిని గమనిస్తే.
ఎల్లో మీడియాలో విభజన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.ఓ వర్గం తమపై పడిన ముద్రను తుడిచేసుకునేందుకు ప్రయత్నించడంతోపాటు.
జగన్ కు చేరువ అవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మరి ఏం జరుగుతుందో ? చూడాలి.