పసుపు కప్పలను మీరు ఎప్పుడైనా చూశారా ?

వర్షాకాలం మొదలైన అంటే ప్రకృతి ఎంత అందంగా మారుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనం ఎన్ని నీళ్లు పోసిన పెరగని చెట్లు ఒక్క రాత్రి వర్షం కురిస్తే చాలు మరుసటి రోజుకు పెరుగుతాయి.

 Yellow Frogs, Yellow Frogs Found In Madhya Pradesh Photos Viral , Madhya Pradesh-TeluguStop.com

వర్షానికి అంత పవర్ ఉంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మొక్కలు ఎలా అయితే పెరుగుతాయో.

అలానే ఈ వర్షాకాలంలో ఉశీళ్లు, పెద్దసైజు కప్పలు, ఆరుద్ర పురుగుల అన్ని బయటకు వస్తాయి.

ఇంకా ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా కనిపించని పసుపు రంగు కప్పలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.

మధ్యప్రదేశ్‌లోని నర్సింగాపూర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్గావ్‌లో ఈ పసుపు రంగు కప్పలు మళ్లీ కనిపించాయి.ఇంకా ఈ కప్పలను చూసేందుకు చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని వాటి వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు.

సాధారణ రంగు కప్పల రంగులో కాకుండా పసుపు రంగులో కప్పలు ఉండటంతో వీటిని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.అయితే ఆ గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఈ కప్పలు పుట్టునట్టు జంతు శాస్త్రనిపుణులు చెప్తున్నారు.

అంతేకాదు.ఈ అరుదైన జాతి కప్పలు ప్రమాదకరమైనవి కాదు అని, ఇవి అడవుల్లో పుట్టే కప్పలు అని వారు చెప్తున్నారు.

కాగా ప్రస్తుతం ఈ పసుపు కప్పల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube