వర్షాకాలం మొదలైన అంటే ప్రకృతి ఎంత అందంగా మారుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మనం ఎన్ని నీళ్లు పోసిన పెరగని చెట్లు ఒక్క రాత్రి వర్షం కురిస్తే చాలు మరుసటి రోజుకు పెరుగుతాయి.
వర్షానికి అంత పవర్ ఉంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా మొక్కలు ఎలా అయితే పెరుగుతాయో.
అలానే ఈ వర్షాకాలంలో ఉశీళ్లు, పెద్దసైజు కప్పలు, ఆరుద్ర పురుగుల అన్ని బయటకు వస్తాయి.
ఇంకా ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా కనిపించని పసుపు రంగు కప్పలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.
మధ్యప్రదేశ్లోని నర్సింగాపూర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమ్గావ్లో ఈ పసుపు రంగు కప్పలు మళ్లీ కనిపించాయి.ఇంకా ఈ కప్పలను చూసేందుకు చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని వాటి వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు.
సాధారణ రంగు కప్పల రంగులో కాకుండా పసుపు రంగులో కప్పలు ఉండటంతో వీటిని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున వచ్చారు.అయితే ఆ గ్రామంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఈ కప్పలు పుట్టునట్టు జంతు శాస్త్రనిపుణులు చెప్తున్నారు.
అంతేకాదు.ఈ అరుదైన జాతి కప్పలు ప్రమాదకరమైనవి కాదు అని, ఇవి అడవుల్లో పుట్టే కప్పలు అని వారు చెప్తున్నారు.
కాగా ప్రస్తుతం ఈ పసుపు కప్పల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.