ఏంటి అని షాక్ అవుతున్నారా? అవునండి.పసుపు రంగులో ఉన్న అనకొండ పాము ఏకంగా 11 పాము పిల్లలకు జన్మనిచ్చింది.
కోల్కతా నగరంలోని అలీపోర్ జంతప్రదర్శనశాలలో ఉన్న ఈ అనకొండ 11 పాము పిల్లలకు జన్మనిచ్చింది.ఇంకా ఈ విషయాన్నీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జూ అథారిటీ చీఫ్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.
కాగా ఈ అరుదైన పాము పిల్లలను జూ కీపర్లు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.అలీపోర్ జంతుప్రదర్శనశాలలో ఈ అరుదైన పాములు సందర్శకులకు మరింత కనువిందు చేయనున్నాయి.కాగా గత సంవత్సరం జూన్ నెలలో ఈ అరుదైన నాలుగు పాములను మద్రాస్ స్నేక్ పార్కు నుంచి అలీపోర్ జూపార్కుకు తీసుకువచ్చినట్టు అయన తెలిపారు.
పాములకు సహజసిద్ధమైన వాతావరం ఉండేలా కుంట, రాళ్లు, వృక్షాలతో ఆవరణ ఏర్పాటు చేశారు.
ఇంకా ఇప్పుడు పుట్టిన పిల్ల పాములను తల్లి పాము వదిలేస్తుందని తమంతట తామే జీవిస్తాయని జూ పార్కు అధికారులు చెప్పారు.ఇంకా ఈ అరుదైన అనుకోండ పిల్లలు సందర్శకులను ఆకట్టుకుంటాయి అని అధికారులు చెప్తున్నారు.