నిమ్మగడ్డకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు..?

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత బాబుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శల జల్లు కురిపించారు.మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 Ap, Ycp, Srikanth Reddy, Nimmagadda Ramesh, Chandra Babu,-TeluguStop.com

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి ఎన్నికల కమీషనర్ గా నియమించడంపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమీషనర్ గా కొనసాగించాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ఇచ్చిన లేఖను తాము గౌరవిస్తామని అన్నారు.

వ్యవస్థలు శాస్వతం అని అందులో చంద్రబాబు వ్యక్తులు కాదని ఆయన అన్నారు.ఇంకా ఎస్ఈసి వ్యవహారంలో హైకోర్ట్ తీర్పుని కన్సిడర్ చేయమని గవర్నర్ చెప్పారన్నారు.కాని ఈ వ్యవహారం సుప్రీం కోర్ట్ లో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.నిమ్మగడ్డ లక్షలు లక్షలు ఇచ్చే లాయర్లను పెట్టుకున్నారని, అసలు ఆ డబ్బులు ఆయనకు ఎవరు ఇస్తున్నారని నిలదీశారు.

చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడు అలవాటుగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.

నిమిషానికి లక్షలు లక్షలు తీసుకునే లాయర్లను పెట్టుకున్నారై ఆయన ఆరోపించారు.చంద్రబాబు నాయుడు వెన్నుపోతుకి అలవాటు పడ్డారు అని ఆయన మండిపడ్డారు.నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా శాస్వతంగా ఉండాలి అని టీడీపీ భావిస్తుందని ఆయన ఆరోపించారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం సుప్రీం కోర్ట్ లో ఉంది కాబ్బట్టి ఎం జరుగుతుందో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఎవరు స్పాన్సర్ చేస్తే లాయర్లను పెట్టుకున్నారని ఆయన నిలదీశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube