వైసీపీ నేతలు మోసం చేసి ఓడించారు.. సంచలనం సృష్టిస్తున్న సర్పంచ్ అభ్యర్థి లేఖ.. ?

రాజకీయాల్లో రాణించాలంటే రాటుదేలి ఉండాలంటారు అనుభవజ్ఞులు.అమాయకంగా ఉంటే మాత్రం ఉన్నదంతా ఊడ్చుకోవడం జరుగుతుందని ఎన్నో సార్లు నిరూపించబడింది.

 Ycp Sarpanch Candidate Letter To Ys Jagan,  Kurnool, Devanakonda, Ycp, Sarpanch-TeluguStop.com

ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఏపీలోని దేవనకొండ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలోకి దిగిన గీత అనే మహిళ పరాజయాన్ని మూట గట్టుకున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో 40 లక్షల వరకు ఖర్చు చేశానని, వైసీపీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేయించి, వైసీపీ నేతలు మోసం చేశారంటూ అభ్యర్థి గీత సీఎం కు ఆవేదనతో లేఖ రాశారు.

ఖర్చంతా తనతో పెట్టించి చివరికి ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు.

వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్న నన్ను ఎన్నికల్లో దించి నిండా అప్పులపాలు చేశారని, ఈ విషయంలో ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అని లేఖలో పేర్కొన్నారు గీతా.

అయిన రాజకీయాలంటే ఊహించుకున్నంత ఆషామాషీ కాదు.

మరి ఎవరో చెప్పిన మాటలు పట్టించుకుని ఇలా అప్పులపాలై ఆత్మహత్యచేసుకుంటా అని బెదిరించడం ఎందుకు ముందే పోటీ చేయకుండా ఉంటే చాలు కదా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube