రాజకీయాల్లో రాణించాలంటే రాటుదేలి ఉండాలంటారు అనుభవజ్ఞులు.అమాయకంగా ఉంటే మాత్రం ఉన్నదంతా ఊడ్చుకోవడం జరుగుతుందని ఎన్నో సార్లు నిరూపించబడింది.
ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఏపీలోని దేవనకొండ మేజర్ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి గా పోటీలోకి దిగిన గీత అనే మహిళ పరాజయాన్ని మూట గట్టుకున్నారు.
అయితే ఈ ఎన్నికల్లో 40 లక్షల వరకు ఖర్చు చేశానని, వైసీపీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేయించి, వైసీపీ నేతలు మోసం చేశారంటూ అభ్యర్థి గీత సీఎం కు ఆవేదనతో లేఖ రాశారు.
ఖర్చంతా తనతో పెట్టించి చివరికి ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు.
వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్న నన్ను ఎన్నికల్లో దించి నిండా అప్పులపాలు చేశారని, ఈ విషయంలో ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అని లేఖలో పేర్కొన్నారు గీతా.
అయిన రాజకీయాలంటే ఊహించుకున్నంత ఆషామాషీ కాదు.
మరి ఎవరో చెప్పిన మాటలు పట్టించుకుని ఇలా అప్పులపాలై ఆత్మహత్యచేసుకుంటా అని బెదిరించడం ఎందుకు ముందే పోటీ చేయకుండా ఉంటే చాలు కదా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.