వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని కొద్ది గంటల క్రితం ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఆయన నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే.కొన్ని సామాజిక వర్గాలను ప్రేరేపించే రీతిలో వివాదాలు సృష్టించే విధంగా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు.
పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణం రాజు కొడుకు భరత్.తన తండ్రి ని అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండా.ముందుగా సమాచారం తెలియకుండా ఆయనను అరెస్టు చేయటం పైగా నెంబర్ ఆఫ్ పార్లమెంట్ హోదా కలిగిన వ్యక్తి పట్ల ఈ విధంగా వ్యవహరించడం దారుణం అని మండిపడ్డారు.ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.తన తండ్రికి హార్ట్ సర్జరీ జరిగిందని.ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ విధంగా అరెస్టు చేస్తారా .? అంటూ ప్రశ్నించారు.ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే ఈ విధంగా ఇష్టానుసారంగా అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు.కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పులు తన తండ్రి ప్రశ్నించడం వల్లే ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేసిందని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.