వైసీపీ రాజ్యసభ పేర్లు ఖరారు! ఆ ఇద్దరు మంత్రులకి ఛాన్స్

ఏపీలో అధికార పార్టీ వైసీపీ తరుపున రాజ్యసభ రేసులో ఉన్నవారి గురించి చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవి వైసీపీ తరుపున రాజ్యసభకి వెళ్తారని టాక్ వినిపించింది.

 Ycp Rajya Sabha Candidate Confirmed-TeluguStop.com

అలాగే మోహన్ బాబు పేరు కూడా వినిపించింది.ఇలా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి.

అయితే వైసీపీ పార్టీ తరుపున రాజ్యసభకి వెళ్ళే అభ్యర్ధుల పేర్లుని తాజాగా అధిష్టానం ఖరారు చేసింది.

రాజ్యసభ సీట్లు ఖరారు అయిన వారిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, రాంకీ సంస్థల చైర్మన్ అయోధ్య రామిరెడ్డి పేర్లు ఉన్నాయి.

వారితో పాటు అంబానీ రిఫర్ చేసిన పారిశ్రామిక వేత్త పరిమళ్ నత్వానికి పేరు కూడా కన్ఫర్మ్ అయ్యింది.ఇక అంబానీ, జగన్ మీటింగ్ వెనుక అప్పుడు పెట్టుబడులు అనే కారణం వినిపించిన ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చేసింది.

ఇక ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవులు పొందిన మోపీదేవి, పిల్లికి, ఇప్పుడు చట్టసభని జగన్ రద్దు చేయాలని భావించడంతో ఆ ఇద్దరు మంత్రులని రాజ్యసభకి పంపిస్తున్నారు.ఇప్పుడు వీళ్ళు మంత్రి పదవులు వదులుకోవాల్సి వస్తుంది.

మరి వీరి స్థానంలో కొత్తగా ఎవరికైనా మంత్రి పదవులు జగన్ ఖరారు చేస్తారేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube