గత ఎన్నికల్లో వైసీపీ ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా విజయనగరం.ఇక్కడ అసలు వైసీపీకి ఇప్పటి దాకా తిరుగులేకుండా పోతోంది.కానీ జగన్ మాత్రం ఇంకా జాగ్రత్త పడుతూనే ఉన్నారు.అన్ని జిల్లాల వారీగా తమ పార్టీ బలా బలాలను బేరీజు వేసుకుంటూనే ఉన్నారు.ఇందులో భాగంగానే ఇప్పుడు విజయనగరం జిల్లా మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.గతంలో గెలుపుని పక్కన పెట్టి మరీ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్నా సరే మళ్లీ పై చేయి సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
గతంలో లాగే క్లీన్ స్వీప్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక గతంలో వైసీపీకి విజయనగరం తరఫున బొత్స సత్యనారాయణ అధినాయకత్వంలో వెళ్లారు.
ఇంకోవ ఇషయం ఏంటంటే బొత్స కుటుంబ సభ్యులకే జగన్ ఎక్కువ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు.కాగా ఇలా ఒకే కుటుంబానికి పెద్ద పీట వేస్తే వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సీన్ రివర్స్ చేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో పూసపాటి రాజు అశోక్ వైసీపీకి బలమైన పోటీ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది.ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా బొబ్బిలి రాజులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది.
బొబ్బిలి సుజయ క్రిష్ణ రంగారావు సుదీర్ఘ కాలంగా విజయనగర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆయన గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే కూడా అయ్యారు.కానీ జగన్ బొత్సను చేరదీయడంతో ఆయన గత ఎన్నికలకు ముందు చంద్రబాబుకు దగ్గరయి ఆ పార్టీలో చేరారు.నిజానికి ఆయన టీడీపీకి వ్యతిరేకంగానే ఉంటారు.అందుకే ఆయన్ను మళ్లీ వైసీపీలోకి తీసుకువచ్చేందుకు జగన్ రెడీ అవుతున్నారంట.బొత్స హవాను తగ్గించి వారికి పెద్ద పీట వేస్తే ప్రత్యర్థులను ఈజీగా ఎదుర్కోవచ్చనే ప్లాన్లో జగన్ ఉన్నారని తెలుస్తోంది.