ఎక్కడైనా ఏ పార్టీలో అయినా.ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనేది నేతల లక్ష్యం.
ఇదే ఎన్నికల్లోనూ .పార్టీలోనూ నాయకులకు కలిసి వచ్చే ప్రధాన ఫార్ములా.కానీ, అనూహ్యంగా వైసీపీలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్లో ఉంది.ఈ పార్టీలో నాయకులు సొంత పార్టీ నేతలపైనే పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం ఎంపీలు ఈ వ్యవహారంలో మరింత ముందంజలో ఉన్నారని అంటున్నారు.టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురంలో గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో తప్ప.
జిల్లా వ్యాప్తంగా వైసీపీ దూకుడు ప్రదర్శించింది.ఇద్దరు ఎంపీలను గెలుచుకుంది.
దీంతో వచ్చే ఎన్నికల నాటికి మరింత పుంజుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.నిజానికి అందరూ వైసీపీ వారే అయినప్పుడు.నాయకులు కలిసి రావడం, సమస్యలపై దృష్టి పెట్టడం సహజం.గతంలో టీడీపీ హయాంలో ఇలానే చేసేవారు.
అందరూ చర్చించుకుని ఓ మాటపై నిలిచి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం అయితే చేసేవారు.కానీ, ఇప్పుడు వైసీపీలో మాత్రం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇద్దరూ కూడా ఈ ఫార్ములాను పక్కన పెట్టి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు రెడీ అవుతున్నారు.
దీంతో వివాదాలు వారు వెతుక్కోకుండానే తలుపు తడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
రంగయ్య విషయానికి వస్తే.
ఆయన దూకుడు ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.ఇటీవల కళ్యాణ దుర్గం, రాయదుర్గం ఎమ్మెల్యేలు పరోక్షంగా రంగయ్యపై విరుచుకుపడ్డారు.
మా నియోజకవర్గాలను శాసిస్తారా? అంటూ.ఇద్దరూ దాదాపు యుద్ధం ప్రకటించారు.
ఈ పరిణామాలు రంగయ్యను ఆత్మరక్షణలో పడేశాయి.ఇక, హిందూపురం ఎంపీ మాధవ్ కూడా తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వేలు పెడుతున్నారు.
ఆయనకు తన లోక్సభ నియోజకవర్గంలో హిందూపురం, పెనుగొండ నేతలతో విబేధాలు ఉన్నాయి.పోనీ ఈ ఇద్దరు ఎంపీలు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నారా? అంటే.కేంద్రం కోత కోసింది.మాదగ్గర ఏమున్నాయని అంటూనే.తన హవా పెంచుకునేందుకు హల్చల్ చేస్తున్నారు.ఈ పరిణామాలతో వివాదాలు తెరమీదికి వస్తున్నాయే తప్ప.
వీరివల్ల పార్టీకి ప్లస్ అవుతోన్న పరిస్థితి అయితే లేదు.