ఏపీలో రాజకీయంగా బద్దశత్రువుల్లా వ్యవహరిస్తున్న పార్టీలు రెండే ఉన్నాయని అందరు అనుకుంటున్న విషయం తెలిసిందే.ఆ రెండు పార్టీలే వైసీపీ, టీడీపీ.
ఈ ఇరు పార్టీ నేతల మధ్య ఎప్పుడు పొయ్యిలో ఉప్పు చిటపటలాడుతున్నట్లుగా ఉంటుంది.
ప్రస్తుతం టీడీపీలో వాదనలు చేసే గొంతులు తక్కువవగా, వైసీపీలో మాత్రం పదునైన మాటలతో చురకత్తుల్లా చురకలు అంటించే వారు ఎక్కువే ఉన్నారు.
అలాంటి వారిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు అన్న విషయం అందరికి తెలిసిందే.
ఈ ఎంపీ, టీడీపీ అధినేతతో పాటుగా ఆయన పుత్ర రత్నాన్ని విమర్శించడంలో ఎప్పుడు కొత్తదనాన్ని చూపిస్తుంటారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఉమా మహేశ్వర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాబు దొంగల బడిలో ట్రెయినింగ్ తీసుకున్న వాళ్లంతా దొరికిపోతున్నారంటు ఈ మధ్య కాలంలో టీడీపీ పై వస్తున్న ఆరోపణలు జోడించి తీవ్రంగా విమర్శించారు.
ఇదిలా ఉండగా అంతకు ముందు విశాఖ ఉక్కు పరిశ్రమ గొప్పతనాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.