చంద్రబాబే హైదరాబాద్ లో .. కియా,అమర్రాజా ఏపీలోనే...

కీలకమైన కియాప్లాంట్, అమర రాజా కంపెనీలు తమిళనాడుకు తరలించినట్లు విస్తారంగా ప్రచారం చేశారని, అయితే ఈ రెండు పరిశ్రమలు ఎక్కడికి వెళ్ళలేదని కానీ చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ పారిపోయాడని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి విమర్శించారు.సోమవారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి పలు విమర్శలు చేశారు.

 Ycp Mp Vijayasai Reddy Comments On Chandra Babu Over Kia And Amara Raja Companie-TeluguStop.com

ప్రసారానికి, వాస్తవానికి తేడాను చంద్రబాబు గుర్తుంచకకోవడం ఆయన గొప్పతనం అన్నారు.విశ్వసనీయత అనేది వెళ్లడానికి చాలా సౌమ్యంగా మామూలుగా అనిపిస్తుంది దాని ఆచరణ వ్యక్తిగతంగా మలుచుకోవడం అంత ఈజీ కాదు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీకి అయితే చంద్రబాబు అవకాశవాది.వర్గం భజన వల్లే చంద్రబాబు ఇన్నాళ్లు మనగలిగడు అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ లో పేర్కొన్నారు.

చంద్రబాబు ఆయన చిల్లర గ్యాంగ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నలువైపుల నుంచి మన తుపాకులతో కాల్పులు జరుపతున్నామని భ్రమపడుతుంటారు.ఇక ఫినిష్ అన్నట్లు ఉంది వాళ్ళ వాలకం.

అధికారంలో ఉన్నప్పుడు దళితులపై తెలుగుదేశం పార్టీ నేతలు హత్యాకాండ సాగించారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవైపు దాడులు మరోవైపు అసలు కన్నీళ్లు.

Telugu Ap Cm Jagan, Ap, Chandra Babu, Jaganannavidya, Kia Amara Raja, Tribal, Yc

రాష్ట్రంలో ప్రశాంతతను కొట్టడానికి ఏం చేయాలనే దానిపై స్కెచ్ వేస్తున్నాడు చంద్రబాబు విజేతల జైత్రయాత్రను గుంటనక్కలు అడ్డుకోలేదు అంటూ మరో ట్వీట్ చేశారు.జగనన్న విద్య దీవెన పథకాన్ని వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 47,32,064 మంది విద్యార్థులకు 731.30 కోట్ల ఖర్చుతో విద్యార్థులకు అవసరమైన విద్యా సమాగ్రీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలతో సహా కిట్లు అందజేశారని ట్వీట్ లో ప్రస్తావించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube