తన పేరు చెప్పి భూ కబ్జాలకు పాల్పడే వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి హెచ్చరించారు.విశాఖలో మీడియాతో మాట్లాడిన విజయ సాయిరెడ్డి.
తన పేరు చెప్పి ఎలాంటి భూ సెటిల్ మెంట్లు చేసినా వారిని ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు.సీఎం జగన్ సైతం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు.
భూ అక్రమాల ఆరోపణలపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారని గుర్తు చేశారు.భూ అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి పెద్దవారైనా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు.
ఈ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలా ఎవరు ఉన్నా క్షమించేది లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.తన పేరు ఉపయోగించి సెటిల్ మెంట్లు చేసే వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ, దేవాదాయ, ఇలా ఏ ఇతర భూముల జోలికి వచ్చినా వదిలేది లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.