నాకేం జరిగినా బాబుదే భాద్యత, జేఏసీ ముసుగులో వారే నాపై దాడి చేశారు అంటున్న వైసీపీ ఎంపీ

ఆదివారం అమరావతి లో జరిగిన అమరేశ్వర స్వామి రధోత్సవానికి ఎంపీ నందిగం సురేష్ కూడా హాజరయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనపై అమరావతి సెగ తగిలింది.

 Ycp Mp Nandigam Suresh Comments On Chandrababu Naidu-TeluguStop.com

రధోత్సవం ముగిసిన తరువాత అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతున్నా ఎంపీ సురేష్ ను లేమల్లె లో మహిళా రైతులు అడ్డుకొని జై అమరావతి,జై చంద్రబాబు అంటూ ఒకటే నినాదాలు చేశారు.అంతేకాకుండా కారుపైకి కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నించడం తో భద్రతా సిబ్బంది అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ నేపథ్యంలో ఆయన తాజగా మాట్లాడుతూ… ఆదివారం చోటుచేసుకున్న పరిణామాలకు చంద్రబాబు నాయుడే కారణమని,నాకేమైనా బాబుదే భాద్యత అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు.జేఏసీ ముసుగులో టీడీపీ మహిళా కార్యకర్తలే నాపై దాడికి దిగారు అని,దానికి సంబందించిన ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ ఎంపీ ఆరోపించారు.

జై అమరవతి,జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసిన వారు తనను నోటికొచ్చినట్లు తిట్టినట్లు తెలిపారు.చంద్రబాబు అవినీతి బయటపడుతోందని తమపై దాడులు చేస్తున్నారని నందిగం సురేష్ పేర్కొన్నారు.

నిన్న అమరేశ్వర స్వామి రథోత్సవానికి బెజవాడకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ నందిగం సురేష్‌ హాజరయ్యారు.అయితే, ఈ కార్యక్రమానికి అమరావతి రైతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు.

మంత్రి మోపిదేవి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే నంబూరు శంకర్‌ రావుల దగ్గరకు వెళ్లి జై అమారావతి అంటూ నినాదాలు చేశారు రాజధాని రైతులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube