ఏపీలో సీఎం జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.బీసీ ఓటు బ్యాంకును చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారని ఆరోపించారు.
బీసీ, ఎస్సీలను చంద్రబాబు అపహేళన చేస్తూనే ఉన్నారని విమర్శించారు.రాజ్యసభలో బీసీలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు.
పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం వెంపర్లాడటం మాత్రమే చంద్రబాబులో కనిపిస్తోందని మండిపడ్డారు.రాజకీయాల్లో తాను ఫెయిల్యూర్ అన్న పవన్ తో చంద్రబాబు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎంపీ భరత్ వెల్లడించారు.