ఏపీ సీఎం బంధువు, వైసీపీ కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.దివంగత సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 1,2 తేదీల్లో ఏపీ సీఎం జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇడుపుల పాయలో పర్యటించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు,ప్రజా ప్రతినిధులు,మీడియా ప్రతి నిధులు అలానే వైఎస్ కుటుంబ సన్నిహితులకు ప్రతి ఒక్కరికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ పరీక్షల్లో అవినాష్ కు పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.
పరీక్షల్లో అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
అవినాష్ రెడ్డి వెంటనే హోం ఐసోలేషన్కు వెళ్లారు.
తన వెంట గత వారం రోజుల నుంచి తిరుగుతున్న వారిని కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు.తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
ఏపీ లో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న విషయం విదితమే.రోజు రోజుకు అక్కడ నమోదు అవుతున్న కరోనా కేసులతో అందరిలో ఆందోళన నెలకొంటుంది.
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తుంది.వైసీపీ నేతలు,మంత్రులు పలువురు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా కరోనా పాజిటివ్ తేలడం తో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.