ఆ వైసీసీ ఎమ్మెల్యేకు చెక్ పెడుతున్న మ‌రో వైసీపీ ఎమ్మెల్యే...!

ఒక‌రి విష‌యంలో ఒక‌రు జోక్యం చేసుకోవ‌ద్దు.ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఒక‌రు జోక్యం చేసుకోవ‌ద్దు.

 Ycp Mlas Targets Each Other,golla Babu Rao,ysrcp ,jagan Mohan Reddy,bollishetty-TeluguStop.com

ఏదైనా ఉంటే.జిల్లా ఇంచార్జ్ మంత్రుల‌కు చెప్పండి.

పార్టీ ప‌రువు తీయ‌కండి“-ఇదీ.ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలినాళ్ల‌లోనే వైసీపీ అధినేత‌గా, సీఎంగా జ‌గ‌న్ త‌న‌పార్టీ ఎమ్మెల్యేల‌కు చెప్పిన కీల‌క మాట‌.

అయితే.ఈ మాట‌ను వింటున్న‌వారు ఎందురు?  పాటిస్తున్న‌వారు ఎందరు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తే.అంతా హంబ‌క్కే అనిపిస్తుంది.ఒక చెవితో విని.మ‌రో చెవితో వ‌దిలేస్తున్నారు.ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు ప‌క్క‌వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్ట‌డం, వారి ప‌నుల‌ను ఆటంక ప‌ర‌చ‌డం ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారిపోయింది.

గుంటూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వైసీపీకి చెందిన స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా మంది నాయ‌కులు.త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారాలు.సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వేలు పెడుతున్నారు.తాజాగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన విశాఖ‌కు చెందిన పాయ‌క‌రావుపేట‌లోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది.

ఇది ఏకంగా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వ‌చ్చింద‌ని అంటున్నారు.ఇక్క‌డ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గొల్ల బాబూరావు విజ‌యం సాధించారు.

వాస్త‌వానికి ఈయ‌న‌కు ప్ర‌తిప‌క్షం నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు.కానీ, నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌కు ఎస‌రు పెడుతున్నారు.

Telugu Golla Babu Rao, Kanna Babu Raju, Ysrcp, Ysrcp Mla-Telugu Political News

నియోజ‌క‌వ‌ర్గంలోని పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, కోటవరట్ల మండ‌లాల్లో న‌లుగురు కీల‌క నాయ‌కులు త‌మ‌దైన శైలిలో చ‌క్రం తిప్పుతున్నారు. పాయకరావుపేటలో దళిశెట్టి బాబురావు, చిక్కాల రామరావు, నక్కపల్లిలో విసం రామకృష్ణ, ఎస్.రాయవరంలో బొలిశెట్టి గోవిందరావు.కోటవరట్లలో తంగేడు రాజులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.ఇక్క‌డ ఎమ్మెల్యే క‌న్నా.వీరిదే పైచేయిగా ఉంది.ఇక్క‌డ ఏ ప‌నికావాల‌న్నా కూడా బాబూరావుక‌న్నా ముందు ప్ర‌జ‌లు వీరినే సంప్ర‌దించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

పింఛ‌న్లు రావాల‌న్నా.సామాజిక ప‌నులు జ‌ర‌గాల‌న్నాకూడా.

వీరే కీల‌కంగా మారారు.దీంతో బాబూరావు ప‌రిస్థితి ర‌బ్బ‌ర్ స్టాంపుగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

దాదాపు ఇప్పుడు ఆయ‌న‌ను సంప్ర‌దించే నాయ‌కులు కూడా త‌గ్గిపోయారు.అంతేకాదు.ఏదైనా స‌మ‌స్య ఉంటే మండ‌ల‌స్థాయిలోనే చ‌ర్చించి ప‌రిష్క‌రించుకుంటున్నారు.అయితే, ఈ రేంజ్‌లో మండ‌లాల‌కు చెందిన నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డానికి కార‌ణ‌మేంటి? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.పొరుగునే ఉన్న య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే క‌న్న‌బాబు రాజు.పాయ‌క‌రావు పేట‌లో రాజ‌కీయాల‌ను శాసిస్తున్నార‌ని తెలుస్తోంది.ఆయ‌న‌కు సంబంధించిన మ‌నుషులను ఇక్క‌డ పెట్టుకుని .అంతా తానే అయి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.ఈ నాలుగు మండ‌లాల్లోనూ చ‌క్రం తిప్పుతున్న‌వారు.క‌న్న‌బాబురాజు క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నార‌ని స్వ‌యంగా ఎమ్మెల్యే బాబూరావు.పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.మ‌రి ఈ వివాదం ఎలా స‌ర్దుమ‌ణుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube