గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది.సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా నాయుడుపేట మల్లాం జంక్షన్ దగ్గర గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కారు లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే తృటిలో తప్పించుకున్నారు.చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది.
అయితే , ఎమ్మెల్యే కారు డ్రైవర్ తప్పేమి లేనట్టుగా తెలుస్తుంది.
అయితే , ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, ఎమ్మెల్యే వరప్రసాద్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ క్రమంలో డ్రైవర్ హరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.మరోవైపు ఎమ్మెల్యే వరప్రసాద్ ని చెన్నైకి తరలించారు.ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు.
ఈ ప్రమాదం జరగడం తో అక్కడ కొద్దిసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వరప్రసాద్ 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు.2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
.