ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం విషయంలో.ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంగతి తెలిసిందే.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై విమర్శలు చేస్తూనే మరో పక్క వైయస్ జగన్ నీ గట్టిగా టార్గెట్ చేస్తూ పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.వైయస్ కావాలని తెలంగాణకు అన్యాయం చేసినట్టు ఆరోపించారు.
ఇటువంటి తరుణంలో తెలంగాణ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.తెలంగాణ నాయకులు వైయస్సార్ ని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం నదీ జలాలను ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వాడుకోవడం.వలన ఆంధ్ర ప్రాంత ప్రజల్లకి అన్యాయం జరుగుతుందని ఈ రీతిగా వ్యవహరిస్తే.చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ జల వివాదం విషయంలో ఇప్పటికే సీఎం జగన్ కి మోడీ కి.కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లెటర్లు రాసినట్లు రోజా స్పష్టం చేశారు.ఇదే రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రోజా విమర్శించారు.
మహిళల భద్రత కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ ని.విమర్శించటం దారుణమని అసలు టీడీపీ హయాంలో మహిళలకు భద్రత లేదని .ఆ సమయంలో మహిళా భద్రతను పట్టించుకోని చంద్రబాబు ని టిడిపి మహిళా నేతలు నిలదీశారా?? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.