ఏపీలో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న అవస్థలకు చలించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వైజాగ్ లో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెల్సిందే.భారీ ఎత్తున ఆ కార్యక్రమానికి జనాలు హాజరు అయ్యారు.
లాంగ్ మార్చ్లో పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది.సీఎం జగన్ మరియు మంత్రులు ఇంకా వైకాపా పార్టీ నాయకులపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేయడంతో వైకాపాకు చెందిన పార్టీ నాయకులు మరియు ప్రభుత్వం తరపున మంత్రులు మీడియా ముందుకు వచ్చి పవన్ పై ప్రతి దాడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ బాబు మీడియా ముందుకు వచ్చాడు.పవన్ కళ్యాణ్ పక్కాగా టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అంటూ ఆరోపించాడు.పవన్ సొంత పార్టీని బలపర్చుకోవడం మానేసి చంద్రబాబు చెప్పిన పనులు చేస్తూ టీడీపీకి కలిసి వచ్చేలా చేస్తున్నాడు.ఇక చంద్రబాబు నాయుడు తన సొంత కొడుకు లోకేష్పై నమ్మకం కోల్పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను దత్తత తీసుకుని ఆయన ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పుడు ఎవరి మెడలో తాళి కడతాడో తెలియని పవన్ కళ్యాణ్ ఇతరులను ఎగతాళి చేయడం హాస్యాస్పందంగా ఉంది అంటూ సుధాకర్ బాబు అన్నారు.