టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది అంటూ వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.శుక్రవారం నాడు ఆయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీకి బైబై చెప్పేందుకు ఒక గ్రూప్ సిద్ధమైంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.మరోపక్క లోకల్ బాడీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉండదన్న భయంతోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు,ఇతర నేతలు ఈవీఎం లపై నెపం నెడుతున్నారు అని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు పై ఆ పార్టీలో నమ్మకం సన్నగిల్లింది అని,బాబు అధికారంలో ఉండి చేయరాని పనులు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు.బాబు రాజకీయాలకు అనర్హులు అని ఆయన మండిపడ్డారు.
ఈవీఎం లు వద్దని ఎన్నికలకు ముందు ఎందుకు ఆ పార్టీ చెప్పలేదు అని, బాబు కు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసు అని విమర్శించారు.
అయినా డీజీపీ ఠాకూర్ పై వైసీపీ పార్టీ అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఆయన ఈ రోజు ఈవీఎం లలో లోపాలు ఉన్నాయంటూ ఆరోపించడం విడ్డూరం అని ఆయన అన్నారు.
బాబు అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని, ఆయన విడుదల చేసిన ఆడియో.గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించేలా ఉందని అన్నారు.సీఎం హోదాలో ఉండి సట్టా మార్కెట్, మట్కాలపై ఎలా మాట్లాడతారంటూ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.