సొంతడబ్బుతో ఉచితంగా ట్రాక్టర్లు అందించిన వైసీపీ ఎమ్మెల్యే..!!

సాధారణంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులతో.అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

 Ycp Mla Provided Tractors For Free With His Own Money Kadapa, Ysrcp, Rachamallu-TeluguStop.com

కానీ కడప జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సొంతడబ్బుతో 23 ట్రాక్టర్లు తన నియోజకవర్గంలో ఉన్న 23 రైతు భరోసా కేంద్రాలకు ఉచితంగా అందించారు.దీని కోసం ఏకంగా ఆయన కోటి 70 లక్షల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టడం జరిగింది.

ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అదేరీతిలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదగా వాటిని రైతులకు అందజేశారు.

ప్రజాస్వామ్య జీవితంలో.

సొంత డబ్బుతో రైతులకు మేలు చేసిన ఏకైక ప్రజాప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పొగడ్తల వర్షం కురిపించారు.అదే సమయంలో కేవలం నియోజకవర్గంలో ప్రజల పైన ఉన్న ప్రేమతోనే ట్రాక్టర్లు అందించడం జరిగిందని.

భగవంతుడు మరింత ఆశీర్వదిస్తే మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేపడతా అని వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు.తన సొంత డబ్బుతో ట్రాక్టర్లు అందించడంతో నియోజకవర్గంలో రైతులు ఎమ్మెల్యే పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube