వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో నూజివీడు అట్టుడికిపోతోంది.నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు, టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సవాళ్లు… ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం విధితమే.
ముందు అనుకున్నట్టే టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పంతం నెగ్గించుకున్నారు.ఎర్ర చొక్కా ధరించి గాంధీ బొమ్మ సెంటర్కు పోలీసుల ఆంక్షలు చేధించుకుని రావడం చర్చణీయాంశంగా మారింది.నేనంటే… నేనే.సవాల్కి జవాబు ఇదే అంటూ అక్కడ హల్చల్ చేశారు.
మరోవైపు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆయన అనుచరులు కూడా హడావుడి చేశారు.అయితే ఆయనతో అలికిడేమీ లేదని టీడీపీ నేతలు చెప్పారు.
ఇరు పార్టీ వర్గాల సవాళ్లు.ప్రతి సవాళ్లతో నాయకులు మోహరిస్తే ఏంజరుగుతుందోనని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ముందస్తుగా పోలీసులు మోహరించారు.రెండు వర్గాల వారిని అదుపులోకి తీసుకుని ప్రయత్నం చేశారు.మరోవైపు సవాళ్ల సీన్ను చల్లబరిచేందుకు యత్నించారు.
ఇది ఎలా ఉన్నా… ముద్దరబోయిన మాత్రం తాను చెప్పిన టైంకే చెప్పిన సెంటర్కే వచ్చానని జబ్బలు చరచుకోవడం గమనార్హం.ఇది అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఇబ్బందనే చెప్పొచ్చు.
దీనిపై చర్చ జరిగినా.జరగకపోయినా తాను రెడీ.అంటూనే… రంగంలోకి దిగి తన పంతం నెగ్గించుకోవడం కలిసొచ్చే అంశమని టాక్.
మొత్తానికి చంద్రబాబు స్ఫూర్తితో ఏపీ మొత్తంగా టీడీపీ లీడర్లు చురుకుగా ముందుకు సాగుతున్నారు.అధికార పార్టీ వైసీపిని ఇబ్బందులు పెట్టేందుకు రంగంలోకి దించుతున్నారు.వచ్చే ఎన్నికల ముందే ఇలాంటివి చోటుచేసుకోవడం చర్చణీయాంశంగా మారుతోంది.
ఇలాంటివి జరగకుండా అధికార పార్టీ వైసీపీనే చూసుకోవాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.లేదంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ దూకుడుతో వైసీపికి ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారు.
మరి వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.