ఏపీలో అధికార వైఎస్సార్సీపీలో అసంతృప్తి జ్వాలలు క్రమక్రమంగా ఎగసి పడుతున్నాయి.పలు జిల్లాలో.
పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు ఇప్పుడు క్రమక్రమంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ జిల్లాకే చెందిన మంత్రులను టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తూర్పు గోదావరి జిల్లా టి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తాను ఎమ్మెల్యేగా ఉన్నా తన నియోజకవర్గంలో ఏ పని జరగడం లేదని ఆయన వాపోతున్నారు.మంత్రుల సహకారం లేకపోవడంతో తాను ఏం చేయలేకపోతున్నానని చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు గ్రామంలో సచివాలయం ఏర్పాటు విషయంలో కూడా మంత్రులు అడ్డుకుంటున్నారని కూడా చిట్టిబాబు చెప్పారంటే సదరు మంత్రులు ఆయన్ను ఎలా ఇబ్బంది పెడుతున్నారో ? అర్థమవుతోంది.
మనమందరం కలిసే ఉన్నాం అనుకుంటున్నా.మంత్రులు మాత్రం నేతల మధ్య విభజన తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ నేతల్లోనే చర్చనీయాంశమయ్యాయి.సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు తరచూ అపాయింట్మెంట్ ఇస్తూ.
నియోజకవర్గంలో సమస్యలతో పాటు.పార్టీ సమస్యలను అడిగి తెలుసుకుంటే గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుంది ? అన్న విషయంపై ఆయనకు ఫీడ్బ్యాక్ ఉంటుదని.లేకపోతే పార్టీ క్షేత్రస్థాయిలో దెబ్బతింటుందన్న ఆవేదన చిట్టిబాబు మాటల్లో కనిపించింది.
ఇక చిట్టిబాబు టార్గెట్ చేసిన మంత్రులు ఇద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే అని.వారిద్దరు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వేలు పెట్టి గ్రూపులను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలను బలహీనం చేస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి.ఇక ఇప్పుడు చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ మంత్రులపై వస్తోన్న విమర్శలకు మరింత ఊతమిచ్చాయి.
మరి జగన్ ఈ మంత్రులను ఎలా కంట్రోల్ చేస్తారో ? చూడాలి.