గడపగడపకు కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలకు ఊహించని షాక్ ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే అనే పదానికి సరైన న్యాయం చేస్తున్న వారిలో మొదటి వరుసలో ఉంటారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” అనే కార్యక్రమంతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం మాత్రమే కాదు అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు.

 Ycp Mla Kethi Reddy Gave An Unexpected Shock To The Tdp Workers Details, Ycp Ml-TeluguStop.com

ఇక ఇదే సమయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల ముందే నిలదీస్తారు.ఆ తర్వాత సమస్య పరిష్కరించడానికి అందుకు సంబంధించిన అధికారులను అలర్ట్ చేస్తారు.

వ్యక్తిగతంగా కూడా ప్రజలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి. సాయం చేస్తూ ఉంటారు.

తన వల్ల అయితే ప్రజలకోసం ఎటువంటి పని అయినా చేయటానికి ఎప్పుడూ కూడా వెనుకాడరు.పార్టీలకు ప్రాంతాలకతీతంగా.ప్రజా సమస్యల విషయంలో స్పందిస్తూ ఉంటారు కేతిరెడ్డి.ఈ క్రమంలో తాజాగా “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఇళ్లను సందర్శిస్తూ ఎం అగ్రహారంలో ఓ ఇంటిపై టీడీపీ జెండా ఎగురుతున్న ఇంటికి వెళ్లి బ్రోచర్ ఇవ్వబోయారు.

ఇంటి యజమాని శివయ్య దాన్ని తీసుకోకుండా…”నీ పథకాలు అవసరం లేదు” అని ముఖం పైనే చెప్పేశాడు.వెంటనే ఎమ్మెల్యే కేతిరెడ్డి వాలంటీర్ నీ పిలిచి వాళ్లు పథకాలు వద్దంటే… ఎందుకు బలవంతంగా ఇస్తున్నారు.తప్పు కదా తీసేయండి అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి సదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఊహించని షాక్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube