ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉంది అంటూ ప్రకటించాడు.రాజధానుల విషయంలో ప్రభుత్వం ముందు చూపుతో ఆలోచిస్తుంది అంటూ ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.
అయితే రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు అంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.పవన్ కళ్యాణ్ కూడా మూడు రాజధానుల విషయమై తీవ్రమైన విమర్శలు గుప్పించాడు.
జగన్ తలా తోక లేని నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపించాడు.
ప్రభుత్వం మరియు సీఎం జగన్పై పవన్ చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ కౌంటర్ ఇచ్చాడు.
ఒక్కో వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉండటం కరెక్ట్ కాదు.కాని రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండటంలో ఎలాంటి తప్పు లేదు అంటూ ఈ సందర్బంగా అన్నాడు.
పవన్కు రాజకీయ అవగాహణ లేదు, రాష్ట్ర పరిపాలను అవగాహణ లేదు.ఎలా ఈ విషయాలపై ఆయన మాట్లాడుతున్నాడు అంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ ప్రశ్నించాడు.