కరోనా బారిన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే..!!

దేశంలో కరోనా విజృంభణ భారీ స్థాయిలో ఉంది.ప్రతిరోజు లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి.

 Ycp Mla Affected By Corona Modi, Undavalli Sridevi, Coronamlatest News-TeluguStop.com

ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని మోడీ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరాటం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు.అయితే ఆమెకు ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండటం తో … పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి అత్యవసర చికిత్సా విభాగం లో జాయిన్ అయ్యారు.

దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఏపీ సీఎంవో పర్యవేక్షిస్తూ ఉంది.ఇదిలా ఉంటే గత వారం నుండి ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన వారు ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వ్యక్తిగత టీం సూచించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube