బీజేపీ అధ్యక్షుడు పై వైసీపీ మంత్రి సీరియస్ కామెంట్స్..!!

వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ మత విద్వేషాలను రెచ్చగొట్టే లా వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

 Ycp Minister Vellampalli Srinivas Serious Comments On Somu Veeraaju Details, Ycp-TeluguStop.com

రాష్ట్రంలో కార్పోరేటర్ గా కూడా గెలిచే స్థాయి లేని వ్యక్తి సోము వీర్రాజు ది అంటూ సెటైర్లు వేశారు.ముఖ్య మంత్రిని పట్టుకొని దేశద్రోహి అంటూ కామెంట్ చేశారని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని… వార్నింగ్ ఇచ్చారు.

జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి… సోము వీర్రాజు అంటూ మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో బీజేపీ పార్టీకి చెందిన మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 40 దేవాలయాలను కూల్చివేశారని స్పష్టం చేశారు.

కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాలను నిర్మిస్తుందని పేర్కొన్నారు.క్యాసినో లు గోవాలో ఉన్నాయని… అక్కడ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించారు.

సోము వీర్రాజు టిడిపి భక్తుడా లేకపోతే దేశభక్తుడా అని ప్రశ్నల వర్షం కురిపించారు.గుడివాడలో క్యాసినో అనే వివాదాన్ని తెలుగుదేశం పార్టీ కావాలని సృష్టించి శాంతి భద్రత సమస్య తలెత్తడానికి ప్రయత్నాలు చేస్తోందని.

గుడివాడ క్యాసినో అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని తెలిపారు.

Ycp Minister Serious Comments On Somu Veeraaju Ycp,somu Veeraaju - Telugu Somu Veeraaju

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube