నిమ్మగడ్డ విషయంలో అధికారులకు వైసీపీ మంత్రి ఊహించని వార్నింగ్..!!

పంచాయతీ ఎన్నికల విషయంలో చట్టాలను గౌరవించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాటవిని ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏ అధికారి అయినా చట్టాలకు అనుగుణంగా కాకుండా నిమ్మగడ్డ ఆదేశాల మేరకు పని చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.

 Peddireddy Ramachandra Reddy Warning To Government Officers In Case Of Nimmagadd-TeluguStop.com

మార్చి 31 తర్వాత సదరు అధికారులను గుర్తుపెట్టుకొని బ్లాక్ లిస్టులో పెడతామని పేర్కొన్నారు.

అంతేకాకుండా నిమ్మగడ్డ మాట విని ఎన్నికలలో అక్రమాలకు పాల్పడితే వారిపై మార్చి 31 తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులకు వైసీపీ మంత్రి ఊహించని వార్నింగ్ ఇచ్చారు.

ఇదే రీతిలో ఏకగ్రీవాల విషయంలో వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.అట్లా కాదు అని రిటర్నింగ్ అధికారులు నిమ్మగడ్డ ఆదేశాలు పాటిస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం బ్లాక్ లిస్ట్ లో ఉండటం గ్యారెంటీ అని పేర్కొన్నారు.

తాజా పరిణామాలతో మంత్రి పెద్దిరెడ్డి వార్నింగ్ తో పాటు నిమ్మగడ్డ ఆదేశాలు తో అటూ ఇటూ కాకుండా మధ్యలో ప్రభుత్వ అధికారులు నలిగిపోతున్నారు. 

Telugu Blacklist, Panchayat Raj, Panchayathi, Peddi, Ysrcp-Telugu Political News.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube