టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన వ్యక్తి చంద్రబాబని మండిపడ్డారు.
ఆరువందలకు పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు.అదే తరహాలో చంద్రబాబు మరోసారి అబద్దాలతో ముందుకు వస్తున్నారని తెలిపారు.చంద్రబాబు జీవితం అంతా నకిలీనేనన్న ఆయన ఆల్ ఫ్రీ చంద్రబాబు పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో పెట్టారని విమర్శించారు.14 ఏళ్లలో చంద్రబాబు చేయనిది నాలుగేళ్లలో జగన్ చేశారని చెప్పారు.అనంతరం టీడీపీ మేనిఫెస్టోను చించేసి చెత్తబుట్టలో వేశారు.