ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు, పట్టాభి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.కావాలనే తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామా అని అభివర్ణించారు.
కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడూ ఈ ప్రభుత్వాన్ని దించేయాలి.అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
సీఎం జగన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న గాని… ఏనాడు సహకరించలేదని అన్నారు.
పక్క ప్రీ ప్లాన్ తోనే టీడీపీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
అప్పట్లో వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబునాయుడు భయపడ్డారు… కానీ జగన్ భయపడే రకం కాదని.స్పష్టం చేశారు.
ప్రజలకే జగన్ భయపడతారు తప్ప… చంద్రబాబు లాంటి నీచులకు దుర్మార్గులకు భయపడని వ్యక్తి జగన్ అని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.పట్టాభి మాట్లాడిన భాష మాదిరిగా మీరు కూడా మాట్లాడండి అని .జగన్ ఆదేశాల ఇస్తే చంద్రబాబు చెవి నుండి రక్తం వచ్చేలా మాట్లాడతాను అని పేర్కొన్నారు.పదవి మాట్లాడిన భాషను బాబు సమర్థిస్తారా.? అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు.ప్రజలలో అపోహ అభద్రతాభావం సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై మచ్చ తీసుకురావడానికి చంద్రబాబు ఆడుతున్న వికృత క్రీడ అంటూ తాజా పరిస్థితులపై మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వం పై ప్రజలనుండి వ్యతిరేకత రావడం లేదని కావాలనే.చంద్రబాబు ఇటువంటి సమస్యలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి.డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.