ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు.
నదులు పొంగిపొర్లుతున్నాయి.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లతో ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది.రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని.కోరారు.
తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని వర్షాల కారణంగా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
అదేరీతిలో లోతట్టు ప్రాంతాలలో ఎక్కడా కూడా నీళ్లు గెలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.ఈ పనులలో వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తూలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.ముఖ్యంగా వర్షాల కారణంగా ఎటువంటి అనారోగ్యాలు ప్రజలకు రాకుండా.అంటువ్యాధులు ప్రబలకుండా.
అన్ని చర్యలు తీసుకోవాలని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.